`కేజీఎఫ్‌` రికార్డుల‌ను ఆ సినిమా బ్రేక్ చేయాలి.. య‌శ్ కామెంట్స్ వైర‌ల్‌!

పునీత్ రాజ్ కుమార్.. కన్నడ పవర్ స్టార్ అయినా పునీత్ అకాల మరణాన్ని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్ నెస్ గా.. ఆరోగ్యంగా ఉండే పునీత్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూసిన విషయం… ఇంకా అటు కుటుంబ సభ్యులు మరియు ఇటు కన్నడ పరిశ్రమ ఇంకా నమ్మలేకపోతున్నారు. పునీత్ చేసింది కొన్ని సినిమాలు అయినా సరే పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపును దక్కించుకున్నాడు.

అనేక సేవా కార్యక్రమాలను చేసి ఎంతోమంది ఆదరాభిమానాలు పొందాడు. ఆయన చివరిగా నటించిన `జేమ్స్` సినిమా ఆయన మరణించిన తర్వాత విడుదలైంది. ప్రస్తుతం పునీత్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతుంది. అయితే పునీత్ నటించిన చివరి సినిమా `గంధన గుడి`. ఈ సినిమా అక్టోబర్ 28న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మె మరియు పలువురు సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హీరో య‌శ్ మాట్లాడుతూ… పునీత్ మరణం విషయంపై ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన సినిమా `కేజిఎఫ్` రికార్డుల‌ను `గంధన గుడి` బ్రేక్ చెయ్యాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నట్లు యష్ తెలిపారు. ప్రస్తుతం యశ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సినిమాని అమోఘ వర్ష దర్శకత్వం వహించగా.. ఇక ఈ సినిమాను పునీత్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ బ్యానర్లో అతని భార్య అశ్విని పునీత్ రాజ్ నిర్మించారు. ఆయన మనల్ని వదిలి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఆయన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ తమ అభిమానాన్ని తెలియజేసుకుంటున్నారు.