ఆ విషయంలో చరణ్ ని బాధపెడుతున్న ఉపాసన..పిల్లల కోసం కాదు.. ఇది వేరే మ్యాటర్..!?

మెగా వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చిరుత వేగంతో రామ్ చరణ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వ‌రుస‌ పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు.

Ram Charan Takes His Wife, Upasana Kamineni On A Dinner Date, Netizens Call  Them Best Couple

రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే. రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం మనకు తెలిసిందే. టాలీవుడ్ లో రామ్ చరణ్ ఉపాసనలకు పిల్లలకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది. ‌ వీళ్లిద్దరు పిల్లలు వద్దనుకోవడానికి పెద్ద రీజనే ఉందట. ప్రస్తుతం రామ్ చరణ్ వరస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పెళ్లి తర్వాత గర్బం దాల్చడమనేది నా పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో పిల్లలు వద్దని అనుకున్నాము. అంతేకాదు ఎపుడు పిల్లలను కనాలనే విషయమై మాకు పూర్తి క్లారిటీ ఉందన్నారు’. మొత్తానికి పిల్లలు కనాలా వద్దా అనే విషయం ఎవరికీ వారు తీసుకోవలసిన నిర్ణయం. అందులో రామ్ చరణ్, ఉపాసన తీసుకున్న నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైంది.

అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. రామ్ చరణ్ కి రుచికరమైన వంటలంటే చాలా ఇష్టంఅట. పెళ్లి అవ్వకముందు రామ్ చరణ్ ప్రతిరోజు రోజుకొక వెరైటీ ఫుడ్డ్ తినేవాడట. ఇక పెళ్లి అయ్యాక రామ్ చరణ్ తన ఆహార అలవాటులను మొత్తం పూర్తిగా మార్చుకున్నారట. దానికి ప్రధాన కారణం అతని భార్య ఉపాసననే. రామ్ చరణ్ ఎప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది ఉపాసన దగ్గరుండి చూసుకుంటుందట. దీంతో రామ్ చరణ్ కొంత ఆవేదనకు గురయ్యాడని తెలుస్తుంది.