షాకింగ్: 18 ఏళ్ల తర్వాత మళ్లీ.. ఆ స్టార్ హీరోల సినిమాలు పోటీపడుతున్నాయా..!

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి ఒకేసారి రావడం సహజమే.. కానీ ముగురు స్టార్ హీరోల సినిమాలు రావటమే అరుదు.. అయితే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వార్ మళ్లీ రిపీట్ అవుతుంది. అది ఎలాగో అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2004వ సంవత్సరం జనవరి 14న బాలకృష్ణ హీరోగా న‌టించిన‌ లక్ష్మీ నరసింహ రిలీజ్ అయింది.. ఈ సినిమాను తమిళ్లో సూపర్ హిట్ ఆయన సామి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి బాలకృష్ణ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

అదే రోజున ఈ సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ప్రభాస్ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాలలో ఒక సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విలన్ గా నటించిన గోపీచంద్ కూడా తన నటనతో ఆకొట్టుకున్నాడు. ఈ రెండు సినిమాల‌కు ఒక రోజు గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా విడుదలైంది. ఈ సినిమాను స్టార్ట్ దర్శకుడు కోడి రామకృష్ణ ఐదేళ్లు కష్టపడి భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కించాడు.

Adipurush first look: Rebel star Prabhas looks like Rama in the poster, See Pics here

ఈ సినిమా విడుదలై ఓపెనింగ్స్ ను భారీగా రాబట్టింది. ఈ మూడు సినిమాలకు ఆ టైంలో థియేటర్లు సరిపోలేదు. భారీ అంచనాల మధ్య అంజి విడుద‌లై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఆ సంవత్సరం సంక్రాంతి విజేతలుగా బాలకృష్ణ -ప్రభాస్ నిలిచారు. మళ్లీ 18 సంవత్సరాలు తర్వాత ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాలి…!!

Chiranjeevi: Fans' Festival .. Mega 154 Release Announcement With Mass Poster