తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో టెంపర్ సినిమా వచ్చి ఒక్కసారిగా తన కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ చిత్రం కథని ఒక్కంతం వంశీ అందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పూరి జగన్నాథ్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా ,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఒక్కంతం వంశీ ఈ సినిమాను తన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించి సక్సెస్ పొందాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ కోరడంతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేయడానికి ఒక్కంతం వంశీ అంగీకరించారని సమాచారం.
వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో మాట్లాడుతూ టెంపర్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. మెహర్ రమేష్ మాట్లాడుతూ టెంపర్ సినిమాను మొదట రవితేజతో చేయవలసి ఉంది కానీ షాడో సినిమా తర్వాత ఒక్కంతం వంశీ కథతో రవితేజ హీరోగా పవర్ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారట. అయితే రవితేజ తో నా డైరెక్షన్లో తెరకెక్కించాల్సిన రెండు సినిమాలు ఆగిపోయాయని మెహర్ రమేష్ తెలియజేశారు.
అయితే స్క్రిప్ట్ విషయంలో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల ఈ రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయని తెలియజేశారు రమేష్. రవితేజ బాబి కాంబినేషన్లో వచ్చిన చిత్రానికి తను అనుకున్న పవర్ సినిమా టైటిల్ని పెట్టారని తెలిపారు మెహర్ రమేష్. అలా రవితేజ నటించాల్సిన సినిమాలో ఎన్టీఆర్ నటించి మంచి విజయాన్ని సంపాదించారని తెలిపారు మెహర్ రమేష్.