టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం `ది ఘోస్ట్` మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించినది. అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాగార్జున మాజీ రా ఏజెంట్గా కనిపించబోతున్నాడు.
ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరోవైపు మేకర్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. వాటిని ఓసారి గమనిస్తే..
నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే ఓవర్సీస్లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 21.15 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే `ది ఘోస్ట్`తో నాగ్ హిట్ కొట్టాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 22 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్ను నాగార్జున రీచ్ అవుతాడా..? లేదా..? అన్నది చూడాలి.