కోలీవుడ్ హీరో కమలహాసన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన చిత్రం విక్రమ్. ఈ చిత్రం కమల్ హాసన్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్స్ పలు సునామిని సృష్టించింది. ఈ సినిమాని కమలహాసన్ బ్యానర్ పైనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో చివరి ఐదు నిమిషాలలో నటించిన సూర్య ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్య రోలెక్స్ పాత్ర థియేటర్లలో ఒక్కసారిగా రచ్చ చేశారు అభిమానులని చెప్పవచ్చు. మొత్తం ఈ సినిమాకే ఈ ఐదు నిమిషాలే స్టఫ్ గా అందిందని చెప్పవచ్చు.
కేవలం రోలెక్స్ పాత్ర ద్వారా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని అందుకుంది. తమిళంలో స్టార్ హీరోగా పేరుపొందిన సూర్య ఈ పాత్రలో అదరగొట్టేశారు. ముఖ్యంగా అత్యంత ప్రేక్షకాదారణ పొందిన ఈ పాత్ర చేయడం తనకి ఇష్టం లేదని ముందుగా ఈ రోల్ చేసేందుకు తను అంగీకరించలేదని విషయాన్ని తెలియజేశారు సూర్య. ఆదివారం రోజున జరిగిన ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ లో సూర్య ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నాడు.ఈ వేదికపై వస్తున్నప్పుడు రోలెక్స్ అంటూ అరుస్తూ హంగామా చేసిన అభిమానులకు.. దీంతో రోలెక్స్ తిరిగి వస్తారా అని హోస్ట్ అడగగా అందుకు.. సమయమే సమాధానం చెబుతుందని తెలియజేశారు సూర్య.
అది వస్తే కచ్చితంగా నేను వస్తానంటూ తెలియజేశారు. సూర్య మాట్లాడుతూ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కమలహాసన్ సారే కారణం. నాకు ఎప్పుడు స్ఫూర్తిగా నిలుస్తూ ఉండేవారు. కమల్ సార్ కాల్ చేసి విక్రమ్ సినిమాలో అవకాశం గురించి చెప్పినప్పుడు నేను వదులుకోవాలని కోలేదు అందుచేతనే ఆ పాత్రలో నటించానని తెలిపారు. ఆ పాత్ర చేయాలంటే చాలా భయంగా అనిపించింది. అదే సమయంలో కమలహాసన్ సార్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.. భయపెట్టిన పనిని చేస్తే మనకు ఎదుగుదల అని నమ్ముతానని కమలహాసన్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయని తెలిపారు. దాంతో ఆ సినిమాని ఓకే చెప్పానని తెలిపారు సూర్య.