అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన మాట మనకు తెలిసిందే. ఈ వార్తలు నిజం చేస్తూ ఇద్దరు తమ బంధాన్ని ఇంకో లెవల్ కు తీసుకు వెళ్లే విధంగా ఈ జంట సిద్ధంగా ఉంది. మీరు రూమర్ అనుకున్నారు నిజమే.. ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇప్పుడు తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి జంట సిద్ధమయ్యారు.
ఈ విషయాం పై రకుల్ తమ్ముడు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. తన అక్క పెళ్లి 2023లో చేసుకోబోతుంది అంటూ రకుల్ తమ్ముడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పెళ్లి చేసుకోబోయేది ఆమె ప్రియుడు జాకీ నే అని అధికారికంగా ఫిక్స్ అయిపోయింది అంటున్నారు ఫ్యాన్స్.
రకుల్ గత రెండు సంవత్సరాలుగా ఇన్స్టాగ్రామ్ లో తన జాకీతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూనే ఉంది. అక్టోబర్ 2021లో రకుల్ జాకీ చేతులు పట్టుకుని ఉన్న అందమైన ఫోటోను షేర్ చేసింది. తమ బంధాన్ని ప్రకటిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. “థాంక్యూ మీరు ఈ సంవత్సరం నాకు పెద్ద బహుమతి… నా జీవితానికి రంగుల మాయం చేసేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. @jackkybhagnani మన ఇద్దరం కలిసి మరిన్ని ఆనంద క్షణాలు గడపాలని నేను ఆశిస్తున్నా… అని ఆమె పెట్టిన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది”. ఇప్పుడు రకుల్ తమ్ముడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో మళ్ళీ వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు.