కని విని ఎరుగని కాంబో..చరణ్ తో పాన్ ఇండియా హీరో మల్టీ స్టారర్ ఫిక్స్..డైరెక్టర్ ఎవరంటే..?

రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన ‘మగధీర’ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘మగధీర’ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళికి రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. రాజమౌళి తర్వాత ప్రభాస్ తో ‘బాహుబలి’ సినిమా తీసి టాలీవుడ్ కీర్తిని ప్రపంచ సినిమాలు దృష్టికి తీసుకెళ్లాడు. రాజమౌళి ప్రభాస్ ఈ సినిమాని ఎంతో కష్టపడి అద్భుతంగా తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా కలెక్షన్లను తీసుకువచ్చింది.

Ram Charan - Prabhas Multistarrer

ఈ సినిమాతో టాలీవుడ్ రేంజ్ మరో లెవల్ కు వెళ్ళింది. ప్రభాస్ కూడా ఆ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్- ప్రభాస్ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తకు సంబంధించి స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ ‘ప్రభాస్-రామ్ చరణ్ తో ఇప్పటి వరకు ఎవరూ తీయని భారీ మల్టీస్టారర్ సినిమాను చేయబోతున్నట్లు ఆయన ప్రకటించాడు.

Trivikram-Prabhas' crazy project on cards? | cinejosh.com

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయబోతున్నట్లు ఆయన చెప్పాడు’. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా రెడీ చేశాడట. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా వర్క్ లో బిజీ అవుతాడని తెలుస్తుంది.