పూజా హెగ్డే కాలికి ఏమైంది..అభిమానులను టెన్షన్ పెడుతున్న లేటెస్ట్ పిక్..!

సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోయిన్‌లో ఒకరిగా కొనసాగుతుంది పూజ హెగ్డే.. తన కెరియర్ మొదట్లో ఐరన్ లాగానే ముద్రతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఆమె నటించే సినిమాల‌ పరంగానే కాకుండా పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది… ప్రతిరోజు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతూ…తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది.. వీటితో పాటు పూజా హెగ్డే తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది.

Pooja Hegde

ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో మరియు టాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది.. తెలుగులో త్రివిక్రమ్- మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా తాజాగా ప్రారంభమైంది.. ఇక తాజాగా ప్రారంభమైన షెడ్యూల్ లో ఈ ముద్దుగుమ్మ పాల్గొనాల్సి ఉండగా… ఇంతలోనే తన కాలికి గాయమై కట్టు కట్టుకొని ఇంట్లో చికిత్స తీసుకుంటి. పూజా హెగ్డే పోస్ట్ చేసిన ఫోటో ఆధారంగా తన కీళ్లలో ఏర్పడే లిగమెంట్ వ్యాధితో బాధపడుతున్న‌ట్టు తెలుస్తుంది.. దీని వలన కొన్ని రోజులు పూజా హెగ్డే ఇంటిలోనే ఉంటే కొంత బెటర్ అని డాక్టర్ సజెషన్ ఇచ్చారట… ఈ మేరకు పూజ తన కాళ్లకు కట్టు కట్టి ఉన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు.