బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. మొదట బాలీవుడ్ లో హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత రామ్ చరణ్ తో నటించిన వినయ విధేయ రామ సినిమా బారీ డిజాస్టర్ ని చవి చూసింది. ఇక ప్రస్తుతం తెలుగులో తన మూడవ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ తో నటిస్తున్నది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి. ఇక కియారా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారనే వార్త గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు మరొకసారి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
కియారా అద్వానీ,సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని వార్తలు బాలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. అది కూడా డిసెంబర్ నెలలో జరగబోతోందా అనే వార్తలు కూడా బీటౌన్ వర్గాల నుంచి బాగా వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి వీరిద్దరూ నోరు మాత్రం మెదపలేదు. కానీ ఇది నిజమే అంటున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. వస్తున్న సమాచారం మేరకు తెరవెనుక విరి వివాహం కోసం పలు ఏర్పాట్లు కూడా చాలా సైలెంట్ గా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా వివాహం ఎక్కడ చేసుకోవాలనే విషయం మీద ఇంకా స్పష్టత రానప్పటికీ రిసెప్షన్ మాత్రం ముంబై లో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయిన తర్వాత ఈ జంట స్వయంగా తమ వివాహ విషయాన్ని ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరి సన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి వివాహ విషయాన్ని ఎప్పుడు తెలియజేస్తారో చూడాలి.