కన్నింగ్ శేఖర్ కమ్ముల ..ఆ హీరోయిన్ ని అంత దారుణంగా మోసం చేశాడా..!?

సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ వెంట పడడం ఫెడవుట్ అయిపోయాక ఆ హీరోయిన్స్ ని పట్టించుకోకపోవడం సర్వసాధారణం .ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి తంతే కొనసాగుతూ వస్తుంది . ఎవరైనా కుర్ర హీరోయిన్ కానీ బ్యూటిఫుల్ హీరోయిన్ కానీ కొంచెం అందంగా ఉన్న జనాలతో కలగలుపుని మాట్లాడిన ఒక్కసారిగా ఆ హీరోయిన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. దీంతో స్టార్ దర్శకులు నిర్మాతలు అందరూ ఆమె తమ సినిమాలో హీరోయిన్గా కావాలి అంటూ వెంటపడి మరి ఆమె కాల్ షీట్స్ బుక్ చేయించుకుంటారు.

కోట్లకు కోట్లు పారితోషకం ఫిక్స్ చేస్తారు . అదే హీరోయిన్ రెండు మూడు సినిమాలు వరుసగా డిజాస్టర్ అయితే మాత్రం ఆ హీరోయిన్ ఎవరు పట్టించుకోరు. ప్రజెంట్ అలాంటి పొజిషన్లోనే ఉంది హీరోయిన్ సాయి పల్లవి. మనకు తెలిసిందే సాయి పల్లవి ఈ మధ్యకాలంలో నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి . రానా హీరోగా నటించిన విరాటపర్వం, ఫిమేల్ ఓరియంటెడ్ రోల్ లో కనిపించిన గార్గి రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి . దీంతో ఒక్కసారిగా సాయి పల్లవికి సినీ అవకాశాలు తగ్గిపోయాయి . అంతేకాదు తన దగ్గరకు వచ్చిన సినిమాలను సైతం సాయి పల్లవి సైన్ చేయట్లేదు అనే న్యూస్ వైరల్ గా మారింది.

కాగా ఈ క్రమంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల సాయి పల్లవిని దూరం పెట్టినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి సాయి పల్లవిని ఫిదా అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది శేఖర్ కమ్ములనే. ఆ తర్వాత లవ్ స్టోరీ అంటూ మరో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కాగా మూడోసారి ధనుష్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని ఫిక్స్ అయ్యారు అంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమా నుంచి సాయి పల్లవిని హీరోయిన్ల లిస్టులో నుంచి తీసేసినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ఓ మంచి తమిళ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోబోతున్నారట. కచ్చితంగా సాయి పల్లవి ఈ సినిమాలో నటించదని సినిమా బృందం నుంచి సమాచారం అందుతుంది. ఈ క్రమంలోని సాయి పల్లవి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఉండడంతో శేఖర్ కమ్ముల.. హ్యాండ్ ఇచ్చాడని న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే శేఖర్ కమ్ముల సాయి పల్లవికి హ్యాండిచ్చి బిగ్గెస్ట్ తప్పు చేశాడు అంటున్నారు జనాలు.