సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఆ సినిమాలు తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
దీంతో ఇప్పుడు అందరి చూపు కేజిఎఫ్ సినిమాలతో స్టార్ దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్తో నటిస్తున్నా సలార్ సినిమా పైనే పడ్డింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. జగపతిబాబు- పృథ్వీరాజ్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్న హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
సలార్ సినిమా నిర్మాతలు ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ ఫైట్ కోసం హాలీవుడ్కు చెందిన ఓ మీడియా సంస్థతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని కచ్చితంగా అవి ట్రెండ్ సెట్టర్ గా మారుతాయి అని నిర్మాణ సంస్థ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.