నందమూరి బాలయ్య కి కోపం వస్తే ఎలా అరుస్తాడో.. మంచి పని చేస్తే దగ్గరికి తీసుకొని అంత పొగుడుతారు . అంతేకాదు బాధ వస్తే తట్టుకోలేరు కన్నీళ్లు పెట్టేస్తాడు. ప్రజెంట్ సోషల్ మీడియాలో బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్న పిక్స్ వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో హోస్ట్ గా మారాడు. ఆహా ఓటీటీ లో బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షోను చేస్తున్నాడు. ఈ టాక్ షోకు బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలోని సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. అభిమానులు సీజన్ 2 కావాలంటూ డిమాండ్ చేసి మరి ఆహా వాళ్లకు స్పెషల్ రిక్వెస్ట్లు పెట్టుకొని బాలయ్య చేత అన్ స్టాపబుల్ 2 స్టార్ట్ చేయించారు. కాగా ఆన్ స్టాపబుల్ 2 షో కి ఈవారం గెస్ట్లుగా టాలీవుడ్ యంగ్ హీరోస్ విశ్వక్ సేన్ సిద్దు జొన్నలగడ్డ వచ్చి తమదైన స్టైల్ లో అలరించారు . కాగా ఈ క్రమంలోనే బిగ్ ఇన్సల్ట్ అనే రౌండ్లో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..తన జీవితంలో జరిగిన బ్యాడ్ ఇనిసి డేంట్ ను గుర్తు చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డను సినీ ఇండస్ట్రీలో ఉండే కొందరు దారుణంగా అవమానించారు అంటూ ఆయన ఓపెన్ గా చెప్పేశారు.
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..” నేను హీరోగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న టైం లో చాలామందిని కలిసాను. చాలామంది నన్ను అవమానించారు. నీ ముఖానికి నువ్వు హీరోనా అంటూ నన్ను అవమానించారు. నీ ముఖం అద్దంలో చూసుకో అంటూ దారుణంగా మాట్లాడారు. ఆ చేదు జ్ఞాపకాలను నేను ఎప్పటికి మర్చిపోలేను” అంటూ చెప్పుకోచ్చాడు. దీంతో ఒక్కసారిగా బాలకృష్ణ ఎమోషన్ అయ్యారు. లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు . “నువ్వు అలా చెప్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి సిద్దు” అంటూ బాలయ్య వెంటనే లేచి సిద్ధుని హగ్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. దీంతో ఒకసారిగా సిద్దు జొన్నలగడ్డ ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు . ఎవడన్నా నిన్ను దారుణంగా అవమానించింది వాడి పేరు చెప్పు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.