మరో క్రేజీ ప్రాజెక్టు లైన్లో పెట్టిన బాలకృష్ణ.. దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమా వీరసింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాను అనిల్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు.

Veera Simha Reddy is the title of Nandamuri Balakrishna's next- Cinema  express

అయితే ఇప్పుడు బాలకృష్ణ -అనిల్ రావిపూడి సినిమా తర్వాత చేసే సినిమాలు గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఆ వార్త ఏమిటంటే బాలకృష్ణ ఈ సినిమా తర్వాత యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ వెంకీ కుడుముల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఆ సినిమాను వెంకీ కుడుముల ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడట.

స్టార్ హీరోను పట్టేసిన వెంకీ కుడుముల.. పిలిచి మరీ అవకాశం ఇచ్చాడట..

బాల‌కృష్ణ కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే వెంకీ కుడుముల ఓ స్టోరీ చెప్పారట. ఆ స్టోరీ నచ్చడంతో బాలకృష్ణ అతనికి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే వెంకీ ..చిరంజీవితో ఓ సినిమా తీస్తున్నాడని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బాలయ్య- వెంకీ కుడుముల కాంబినేషన్ దాదాపు సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది.