ఆ సూపర్ హిట్ సినిమాతో బాలయ్య… సెన్సార్ కి షాక్ ఇచ్చాడా..!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.. గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. బాలకృష్ణ సినిమాలోనే కాకుండా అహలో అన్ స్టాపబుల్ షో తో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. ఈ షో మొదటి సీజన్ సూపర్ హిట్ట్ అవడంతో.. తాజాగా రెండో సీజన్ కూడా మొదలైంది… ఇప్పుడు బాలకృష్ణ తన 107వసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ తన 108వ సినిమాని స్టార్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో చేయబోతున్నాడు.

బాలకృష్ణ తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల‌లో నటించాడు. ఆయన సాంఘికం, పౌరాణికం, జానపదం, అన్ని జోనర్ల సినిమాలో బాలకృష్ణ నటించాడు. అయ‌న‌ కెరియర్లో జానపద సినిమాగా వచ్చిన భైరవద్వీపం సినిమా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలమైన రికార్డులను క్రియేట్ చేసింది. భైరవద్వీపం సినిమా అప్పట్లో ఏ సినిమా అందుకొని అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా సెన్సార్ బోర్డు కు కూడా షాక్ ఇచ్చింది. ఈ సినిమాను అప్పట్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలో కూడా భైరవద్వీపం సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.

ఈ సినిమా సెన్స్ సార్ కట్ లేకుండా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా సెన్సార్ పూర్తయిన తర్వాత సెన్సార్ మెంబర్లు కొన్ని సూచనలు చేశారట.. ఈ సినిమాలో వచ్చే గుర్రాల కింద పడిపోయే సీన్లు మా వరకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వన్యప్రాణి సంరక్షణ వాళ్ళు ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ సీన్లను ఎడిటింగ్లో తొలగించాలని వాళ్ళు చెప్పారట. సినిమా విడుదలయ్యాక ఈ సీన్ల‌లు వారి దృష్టిలో పడలేదు. దీనిపై వన్యప్రాణి సంరక్షణ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.

Bhairava Dweepam'

ఈ సినిమా షూటింగ్ సమయంలో గుర్రాలు పరిగట్టే సీన్లు షూట్ చేసేటప్పుడు… వాటి కాళ్లకు అడ్డంగా వైర్లు కడతారు.. ఆ వైర్లు తగలగానే గుర్రాలు కింద పడిపోతాయి.. ఆ టైంలో వాటి కాళ్లు విరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న సన్నివేశం. ఈ సీన్లు షూటింగ్ పూర్తి అయిన వెంటనే గుర్రాలను అక్కడే ఉన్న వైద్యుడికి చూపించి చికిత్స చేయించారట.. ఈ రకంగా ఈసీన్లు షూట్ చేసేందుకు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా విడుదలై టాలీవుడ్ లోనే సెన్సేషనల్ హిట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాతో బాలకృష్ణకు జానపద హీరోగా ఎంతో మంచి పేరు వచ్చింది.