యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని నెలల కిందట ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే విధంగా డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకే తెలియజేశారు. దీంతో అభిమానులు సైతం ఈ చిత్రంపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలోని నటీనటుల గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వైరల్ గానే మారుతుంది.
అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ట్రాక్ పట్టాలని కొరటాల శివ అనుకుంటున్నట్లుగా అతని సన్నిహితులతో చెప్పినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంపై సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఎన్టీఆర్ 30వ సినిమాలో మొదట ఆలియా భట్ హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఈమె నటించలేదు. దీంతో ఇప్పుడు తాజాగా హీరోయిన్ రష్మిక నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె పుష్ప సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపుని సంపాదించుకుంది. దీంతో ఈమె ఎన్టీఆర్ సినిమాలో నటించడమే కాకుండా ఈమె కెరీర్ కు కూడా ప్లస్ అవుతుందని రస్మిక భావించి ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక డైరెక్టర్ కొరటాల శివ కూడా బిజినెస్ పరంగా బాగా జరిగే అవకాశం ఉంటుంది అని భావించి ఈమెను హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రష్మిక నటిస్తున్నందుకుగాను ఐదు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. మరి ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం ప్రకటించాల్సి ఉన్నది.