RC15 షూటింగ్‌లో అసలేం జరుగుతోంది.. చెర్రీ ఫ్యాన్స్‌కి షాకిస్తున్న ఆ వార్తలు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC15 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రూ.170 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాకి ఓ విశేషం ఉంది. అదేంటంటే ఇది శంకర్ టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్. దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రకటించగా సెప్టెంబర్ నెలలో ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానులతో పాటు తెలుగు, తమిళం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటన్నింటి మధ్యలో RC 15 నిర్మాణ పనుల్లో జరుగుతున్న పరిణామాలు మెగా అభిమానులకు షాక్ ఇస్తున్నాయి.

ఈ మూవీ ఇప్పటికే హైదరాబాద్‌, రాజమండ్రి, అమృత్‌సర్‌లలో షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ షెడ్యూల్ లో జరుగుతున్న నేపథ్యంలో టెక్నీషియన్లు ఒక్కొక్కరుగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. కొన్ని తెలియని కారణాలతో దిల్ రాజు అతన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రామకృష్ణ వాకౌట్ చేసిన తర్వాత అతని స్థానంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డిని తీసుకున్నారు మేకర్స్. అయితే ఆయన కూడా బయటకు వెళ్లినట్లు టాక్ నడుస్తోంది.

కొద్ది రోజుల క్రితం RC15 మూవీ షూటింగ్ కోసం రవీందర్ రెడ్డి యూనివర్శిటీ సెట్‌ను నిర్మించారట. అప్పుడే రవీందర్ రెడ్డి, దిల్ రాజు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. వరుస ఫ్లాపులతో ఇప్పటికే ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు దిల్ రాజు. ఈ సమయంలోనే తనకు నచ్చిన విధంగా రవీందర్ రెడ్డి సినిమా తీయడం లేదనే కారణంతో అతన్ని దిల్ రాజు ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు టాక్ నడుస్తోంది. నిజం చెప్పాలంటే, రవీందర్‌రెడ్డి ఏ విషయంలోనూ రాజీ పడరు. అవసరమైతే సినిమాను కూడా వదిలేస్తారు. ఇప్పుడు కూడా అదే జరిగిందని అంటున్నారు. ఇక శంకర్ తన ప్రాజెక్ట్ ఇండియన్ 2ని రీస్టార్ట్ చేయడానికి Rc15ని హోల్డ్‌లో ఉంచాడు. ఇదిలా ఉండగా టెక్నీషియన్లు బయటకు వెళ్లడం మెగా అభిమానులందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.