బాలయ్య లేటెస్ట్ మూవీ పై మాస్ మాసివ్ అప్డేట్స్..నందమూరి అభిమానులకు పూనకాలే..!!

బాలయ్య సినిమాలు వస్తున్నాయి అంటేనే అభిమానుల్లో అదో తెలియని ఫీలింగ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆయన చెప్పే డైలాగులు వింటుంటే..గూస్ బంప్స్ రావాల్సిందే. అఖండ సినిమాతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన బాలయ్య..కరోనా కష్ట కాలంలో ఉన్న ఇండస్ట్రీకి..నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి డేర్ గా సినిమాను రిలీజ్ చేసి..ఇండస్ట్రీకి ఒక్క మగాడు గా నిలిచాడు. ఈ సినిమా సాధించిన విజయం గురించి..బద్ధలు కొట్టిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన తరువాత ఆయన నుండి వచ్చే ప్రతి సినిమా పై అలాంటి ఎక్స్ పెక్టేషన్స్ నే పెట్టుకుని ఉంటారు జనాలు. ఆ అంచనాలకి ఏ మాత్రం తీసిపోకుండా.. డబుల్ బూస్టప్ తో డైనమిక్ డైరెక్టర్..గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో రాబోతున్నాడు నందమూరి నట సింహం బాలయ్య. స్టార్ డాటర్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య..డ్యూయెల్ రోల్ లో అదరకొట్టబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని.. మేకర్స్ వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని..శరవేగంగా మంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు.

రీసెంట్ గా బాలయ్య బర్తడే కానుకగా వచ్చిన టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. “భయం నా బయోడేటా లోనే లేదురా బోసడీకె” అంటూ ఊర మాస్ డైలాగులతో బాలయ్య విజృంభించేశాడు. దీంతో సినిమా పై అభిమానులు భారీ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన మాసివ్ అప్ డేట్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారట NBK107 టీం. ఈ సినిమా కి సంబంధించి..ఎన్నో టైటిల్స్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వగా..ఫైనల్ గా గోపీచంద్ మల్లినేని..”జై బాలయ్య” అనే టైటిల్ నే ఫిక్స్ చేశారట.

ఈ టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, ఈ సినిమా కి సంబంధించిన మరో అప్ డేట్ కూడా అభిమానులకు కొత్త ఉత్సాహాని ఇచ్చింది. ఈ సినిమా షూట్ కొత్త షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యింది. జూలై24 నుంచి మేకర్స్ కర్నూల్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నారట. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని .. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.