మహేష్ బాబుకు అక్కగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..ఏం కాంబినేషన్ గురు..?

టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వస్తుంది. అప్పుడు ఏమో కరోనా కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్..ఆ తరువాత వాళ్లు అనుకున్న తేదీకి బడా సినిమాలు రిలీజ్ అవ్వుతుండడంతో మహేష్ సినిమాను వెనక్కి నెట్టారు. ఇక ఫైనల్ గా 12 మే 2022 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైయ్యారు.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. తన లక్కి డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో ఈ సినిమాకు సంబంధించి పలు రూమర్లు నెట్టింట షికారు చేయగా ..ఫైనల్ గా వాటికి ఎండ్ కార్డ్ పెడుతూ.. ఈ మధ్యనే SSMB28 సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చిత్ర బృందం. కరోనా కారణంగా ఈ కార్యక్రమాలకు మహేష్ దూరంగా ఉన్నాడు. ఆయన భార్య నమ్రత అన్ని పనులను దగ్గరుండి చూసుకుంది. ఇక ఈ సినిమాలో ఆలియ భట్ హీరోయిన్ గా నటిస్తుంది అని కొందరు..లేదు లేదు సమంత హీరోయిన్ గా నటిస్తుంది అని మరికొందరు.. కాదు కాదు పూజా పాప నే ఈ సినిమాలో హీరోయిన్ అంటూ వాళ్లకు తోచిన పేర్లను మహేష్ పక్కన హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఫైనల్ ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎపంపిక చేసుకున్నారు త్రివిక్రమ్.

ఇక ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నదియా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదివరకే త్రివిక్రమ్ డైరెక్షన్ లో అత్తారింటికి దారేది అనే సినిమాలో పవన్ కు అత్త గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తరువాత మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే నితిన్ హీరో గా నటించిన అ ఆ సినిమాలో సమంతకు తల్లిగా నటించి మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకుంది. అయితే ఈసారి తల్లి, అత్త పాత్రలో కాదు అక్క పాత్రలో కనిపించనుందట ఈ ఆంటీ హీరోయిన్. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నదియా..మహేష్ కు అక్కగా నటించనుందనే వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. మరి చూడాలి మహేష్ అక్క ఏం మాత్రం మెప్పిస్తుందో..?


Leave a Reply

*