ఏంటి చిట్టి ఇది..నీకు ఇది న్యాయమేనా..?

జాతి ర‌త్నాలు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఫుల్ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించాడు. ఇక ఈ సినిమాతోనే ఓవ‌ర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అమ్మడుకు ఉన్న ప్లస్ పాయింట్ హైట్..చూడగానే అకట్టుకునే రూపం..ఎప్పుడు స్మైల్ తో కనిపిస్తూ ఉంటుంది. ఇక జాతి రత్నాలు సినిమాలో అమ్మడు కామెడీ టైమింగ్ అదుర్స్. నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది. దీంతో ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. గతంలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసినా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయిన ఈ బొద్దుగుమ్మ.. ‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ గా చేసి తన నవ్వుతో, తన అల్లరితో, తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో స్టార్ అయిపొయింది.

ఇక ఈ సినిమాలో చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే అనే పాటతో క్యూట్ స్మైల్ ఇస్తూ బాగా పాపులర్ అయ్యింది. అయితే జాతిర‌త్నాలు సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాక ఈ హీరోయిన్ కాల్ షీట్లు మొత్తం బుక్ అయిపోతాయి అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే టోటల్ రీవర్స్ గా మారిపోయింది. అడపదడపా గెస్ట్ రోల్ లో కనిపించిన ఈ బ్యూటీ..రీసెంట్ గా బంగార్రాజు సినిమాలో నాగార్జున, నాగచైతన్య తో కలిసి..అద్దిరిపోయే ఐటెం సాంగ్ లో చిందులేసింది.

ప్రస్తుతానికి అమ్మడు చేతిలో రెండే సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. మంచు విష్ణు తో ఢీ సినిమా సీక్వెల్ లో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రావణాసుర సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా రీసెంట్ గా మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ యంగ్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీంతో చిట్టి అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. నిన్ను హీరోయిన్ లా చూడాలి అనుకుంటుంటే నువ్వు ఏమో.. ఐటెం సాంగ్స్ కు కమిట్ అవుతున్నావు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి చిట్టి ఇక నుండి అయినా అభిమానుల కోసం కొత్త డెసిషన్స్ తీసుకుంటుందా లేదా అని..?