తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన మంగళవారం టాలీవుడ్ లో కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో టాలీవుడ్ లోని సీనియర్ హీరోలను ఆయనే స్వయంగా ఫోన్ చేసి, సమావేశానికి రావల్సిందిగా పిలుస్తున్నారు.అయితే చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ ,ప్రభాస్ లకు చిరంజీవి నుంచి ఫోన్ వెళ్లిందని తెలుస్తోంది. ఈ సమావేశంలో నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, అశ్వనీదత్, , సురేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, మోహన్ బాబు సమావేశం కానున్నారని తెలుస్తుంది .
పలుకీలకమైన అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ఈ మీటింగ్ నిర్వహించబోతున్నారు. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు, 5వ ఆటకు అనుమతి, భారీ బడ్జెట్ చిత్రాలకు తొలి రెండు వారాల్లో టికెట్ రేట్లు పెంచుకునేలా అనుమతులు తీసుకురావడం ప్రధానాంశంగా జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కాబోతున్నారు, టాలీవుడ్లో అగ్ర హీరోలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్