మళ్లీ కెమెరాకు చిక్కిన టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్..!

సందు చిక్కినప్పుడల్లా ముంబై వీధుల్లో దర్శనమిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో రష్మిక ఛలో సినిమాతో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత ఆమె తన రెండో సినిమాగా విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. వీరిద్దరి కెరీర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో డియర్ కామ్రేడ్ అనే మూవీ వచ్చింది. కాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు.

వీరిద్దరూ బ్యాక్ బ్యాక్ సినిమాలు చేయడంతో అప్పటి నుంచి వారి మధ్య ఏదో ఉంది అనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ వారిద్దరూ జంటగా తిరుగుతూ పలుమార్లు కెమెరా కంట చిక్కారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతోంది.

ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న రష్మిక.. తనకు ఏ మాత్రం అవకాశం దొరికినా ముంబై కి వెళ్తుంది. గతంలో కూడా ఓసారి ఈ జంట ముంబై వీధుల్లో కనిపించింది. అయితే వాళ్ళిద్దరూ తాము ప్రేమించుకుంటున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. కేవలం తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని చెబుతున్నారు.ఇదిలా ఉండగా రష్మిక మందన్న కూడా బాలీవుడ్లో తన తొలి సినిమాకు సైన్ చేసింది. మిస్టర్ మజ్ను అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.