టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో `లైగర్` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై బడా నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.
లైగర్ సినిమాతో విజయ్ అటు బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం కాబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా మేకర్స్ రౌడీ ఫ్యాన్స్కి అదిరిపోయే గుడ్న్యూస్ తెలిపారు.
లైగర్ విడుదలకు డేట్ లాక్ చేసిన చిత్ర యూనిట్.. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. అంతే కాదు, ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 31 రోజు లైగర్ గ్లింప్స్ను రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు.
కాగా, ప్రస్తుతం లైగర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను సరికొత్త లుక్, క్యారెక్టరైజేషన్తో పూరి పరిచయం చేయబోతున్నాడు. అలాగే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ కూడా పొందారు. ఇక ఈ పాన్ ఇండియా చిత్రానికి మణిశర్మ, తనిష్క్ బాఘ్చి లు సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/TheDeverakonda/status/1471339122136551424?s=20