నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయిన తారక్.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫస్ట్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఇలా వరుస విజయాలను అందుకున్న ఈయన.. ఆపై వరుస ఫ్లాపులను చవిచూశారు.
ఆ సమయంలోనే వరుస డిజాస్టర్లను తట్టుకోలేక తారక్ డిప్రెషన్లో కూరుకుపోయారట. ఆ టైమ్లో ఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో పడిపోయారట. అలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి ఎన్టీఆర్ను దర్శకధీరుడు రాజమౌళినే బయటకు తీసుకువచ్చారట. వరుస ఫ్లాపులతో ఉన్న ఎన్టీఆర్కు `యమదొంగ` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించారట.
అంతేకాదు, ఆనాటి నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్కు మంచి స్నేహితుడిగా రాజమౌళి ఎప్పుడూ అండగా నిలబడ్డారట. ఈ విషయాన్ని తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కాబోతోంది.
స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పౌ డివివి దానయ్య నిర్మించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు.