అసలు కథ ముందుందన్న పుష్ప రాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సినిమాకు అన్నిచోట్లా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది ఈ చిత్ర యూనిట్.

తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సినిమాను అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు బన్నీ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో తన పాత్రను డిజైన్ చేసిన చిత్ర యూనిట్‌కు ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా ఈ సినిమా చిత్రీకరణ చేయడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో కేవలం పాత్రల ఇంట్రొడక్షన్ మాత్రమే చూపించామని, అసలు కథ ముందుందని బన్నీ చెప్పుకొచ్చాడు. సుకుమార్ రాసుకున్న కథ అమోఘంగా ఉండటంతో ఈ సినిమాలో పుష్ప పాత్ర రెండో భాగంలో ఎలా స్వైరవిహారం చేస్తుందో మీరే చూస్తారని బన్నీ అన్నారు.

మొత్తానికి బన్నీ పుష్ప ది రైజ్ చిత్రం సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో చిత్ర యూనిట్ తెరకెక్కించిన తీరు, ఈ సినిమాకు అన్ని భాషల్లో లభిస్తున్న రెస్పాన్స్ చిత్ర యూనిట్‌కు సంతోషాన్ని కలిగిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలంగా నిలిచిందని, ముఖ్యంగా పాటలతో పాటు బీజీఎం కూడా అదిరిపోయిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, స్టార్ బ్యూటీ సమంత ఈ సినిమాలో హాట్ ఐటెం సాంగ్‌లో చిందులేసిన సంగతి తెలిసిందే.