రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. పుణెలోని సతారా ప్రాంతాల్లో జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్లు తెరకెక్కించినట్టు తెలుస్తుండగా.. ఇప్పుడో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్లో ఓ ట్రైన్ ఎపిసోడ్ను చిత్రీకరించారట.
వందమందికి పైగా ఫైటర్లు పాల్గొనే ఈ యాక్షన్ సీక్వెన్స్ లో చరణ్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో చూపించబోతున్నారట. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. 7 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్కి ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశారట. ఏదేమైనా ఒక్క సీన్ కోసమే డబ్బై కోట్లంటే.. మొత్తం సినిమాకు ఇంకెంత ఖర్చు పెడతారో చూడాలి.