కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి షూటర్గా అలరించబోతోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ సినిమాకు మోక్షం కలిగింది.
`గుడ్ లక్ సఖి` చిత్రాన్ని నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కీర్తి – ఆది పినిశెట్టి – జగపతిబాబు ఉన్న ఓ పోస్టర్ ని విడుదల చేసింది. కాగా, సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. మరియు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.