అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఈ షోలో తనదైన ఆటతీరు, మాటతీరు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.
తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం `అనుభవించు రాజా`. రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగార్జున మేనకొడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించింది. నవంబర్ 26న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ టీంతో కలిసి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా.. రాజ్ తరుణ్పై సంచలన వ్యాఖ్యాలు చేసింది.
అరియానా మాట్లాడుతూ.. తనకు ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదని.. తనతో సినిమా ఎలా చేశానో అర్థం కావట్లేదని తెలిపింది. టీవీలో తన సినిమాలు వస్తే తీసేయాలని చెప్పేదాన్ని అని.. ఒకరోజు రాజ్ తరుణ్ కారులో వెళ్తుంటే తనకు యాక్సిడెంట్ కావాలని శాపం పెట్టానని చెప్పుకొచ్చింది.
దీంతో ఎందకు రాజ్ తరుణ్పై ఇంతలా పగబట్టారు అని ప్రశ్నించగా.. అందుకు అరియానా రెండు సార్లు ఇంటర్వ్యూకి పిలిచి ఆయన హ్యాండిచ్చారు. ఎంతో బాధపడ్డాను. అవమానంగా ఫీల్ అయ్యాను. అందుకే రాజ్ తరణ్పై ద్వేషాన్ని పెంచుకున్నానని పేర్కొంది. అంతే కాదు, అనుభవించు రాజా షూటింగ్ సమయంలో ఓ రోజు కావాలనే రాజ్ తరుణ్ను సెట్లో 8 గంటలు వేయిట్ చేయించి దెబ్బ కొట్టానని సరదాగా తెలిపింది.