బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఇంటి సభ్యులు ఏడో వారంలోకి అడుగు పెట్టారు. మొత్తం 19 మందితో గ్రాండ్గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్పటకే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద మరియు శ్వేతాలు ఎలిమినేట్ అయిపోయారు.
ఇక ఈ రోజు సోమవారం. బిగ్ బాస్ హౌస్లో సోమవారం వచ్చిందంటే నామినేషన్ రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు ప్రేక్షకులు కూడా ఎవరెవరు నామినేట్ అవుతారా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
అయితే లీకుల వీరుల సమాచారం ప్రకారం.. ఏడో వారం కాజల్, సిరి హనుమంతు, జెస్సీ, ప్రియా, లోబో మరియు ఆనీ మాస్టర్ లు నామినేట్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ ఆరుగురిలో ఏడో వారం దుకాణం సద్దేసే కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే మళ్లీ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.