సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మతమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. విషయం ఏంటంటే.. దీపావళి కానుకగా సర్కారు వారి పాట నుంచి బిగ్ ట్రీట్ రాబోతోందట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం దీపావళి కానుకగా నవంబర్ 4న ఫస్ట్ సింగిల్ సాంగ్ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీనిపై తర్వలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.