మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే నెలకు పైగా అపోలో హాస్పటల్లో చికిత్స తీసుకున్న తేజ్.. ఎట్టకేలకు నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
విజయదశమి రోజు చిరు అదిరిపోయే శుభవార్తను చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయాడు. అయితే సాయి తేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్లో అతడి కుడి చేతికి బలంగా దెబ్బ తగలడం చేత ఆ చెయ్యితో ఎలాంటి పనులు చేయలేరు అంటూ ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. కాగా, సెప్టెంబర్ 10న సాయి ధరమ్తేజ్ హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందకు పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాయ్ తేజ్కి అపోలో హాస్పటల్లో ఓ ప్రత్యేకమైన వైద్య బృందం చికిత్స అందించారు. చికిత్సలో భాగంగానే ఆయనకు కాలర్ బోన్ సర్జరీ కూడా జరిగింది.