మాస్ మహారాజా రవితేజ, త్రిష.. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ జంటగా నటించి `కృష్ణ` చిత్రం 2008లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత జంటగా మరే సినిమా చేయకపోయినా.. రవితేజ, త్రిషలు మాత్రం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలోనే గతంలో వారిద్దరిపై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి.
రవితేజ, త్రిషలు రిలేషన్లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక అందుకు తగ్గట్టుగానే వారిద్దరూ కూడా తరచూ చట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. ఇక ఒకసారైతే.. కారులో వెళ్లుండగా రవితేజ, త్రిషలు మద్యం సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
దాంతో వారిద్దరిపై డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసిన పోలీసులు..జరిమానా కూడా విధించారు. ఈ విషయం అప్పట్లో మీడియా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఆ తర్వాత రవితేజ, త్రిషలు కలిసి పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఎవరి కెరీర్తో వారు బిజీ బిజీ అయిపోయారు.