`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన్నా.. టాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. గోవాకు మకాం మార్చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారానికి తాజాగా ఆమె పెట్టినే పోస్టే కారణం. సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉండే రష్మిక.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో `గోవాలో నీకు ఎప్పుడైతే కొత్త ఇల్లు ఉంటుందో.. ఎక్కువగా అసూయ వేస్తుందా?` అని వెరైటీగా ఓ పోస్ట్ వేసింది. ఈ క్రమంలోనే రష్మిక గోవాలో ఇల్లు కొనుగోలు చేసిందని, త్వరలోనే అక్కడకు మకాంను మార్చేయబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అయితే రష్మిక గోవాలో సెటిల్ అవ్వబోతోందని వార్తలు రావడంతో.. కొందరు నెటిజన్లు హీరో విజయ్ దేవరకొండ కోసమే ఆమె అక్కడకు వెళ్లిపోతోందనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమా కోసం గోవాలోనే తిష్ట వేశాడు. అందుకే రష్మిక కూడా అక్కడ ఇల్లు కొనుగోలు చేసిందని టాక్. కాగా, గతంలో రష్మిక-విజయ్ దేవరకొండలపై రకరకాల పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు రాగా.. అవి పుకార్లే అని వారిద్దరూ తేల్చేశారు.