ఆరోగ్యం కోసం స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తా..వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు బాగా అల‌వాటు. ఒక‌వేళ కంటెంట్ ఏమీ లేక‌పోయినా.. తానే ఏదో ఒక‌టి సృష్టించి చిత్ర విచిత్ర‌మైన ట్వీట్లు చేసి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు.

3 part film on Ram Gopal Varma's life in production: First look to be released today - IBTimes India

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మను `మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండ‌టానికి ర‌హ‌స్యం ఏంటీ` అంటూ ప్ర‌శ్నించారు. అందుకు వ‌ర్మ స్పందిస్తూ.. స్మశానంలో క్షుద్ర పూజలు చేయటం అని వర్మ చెప్పుకొచ్చారు. క్షుద్ర దేవతల నుంచి కొన్ని వరాలను పొందాను కాబట్టే ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉంటాన‌ని వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు.

Ram Gopal Varma booked in 'Murder' movie row | Entertainment News – India TV

అయితే స్మశానంలో క్షుద్రపూజలు అంటే.. ఎవరినైనా బలి ఇవ్వడలు, వంటివి ఏమీ ఉండవు. కేవలం ఒక మర్రి చెట్టు కింద కూర్చుని, అలా ఆకుల వైపు చూస్తే.. దెయ్యాలు ప్రత్యక్షమ‌వుతాయి. అలా వాటితో మాట్లాడి, మసాజ్ వంటివి చేయించుకుంటాను. అందుకే నా ఆరోగ్యానికి సీక్రెట్ అంటూ వ‌ర్మ చెప్పుకొచ్చాడు.