ప్రియ‌మైన వ్య‌క్తితో దుబాయ్ చెక్కేసిన వ‌రుణ్ తేజ్‌..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజాగా ప్రియ‌మైన వ్య‌క్తితో క‌లిసి దుబాయ్ చెక్కేశాడు. ఇంత‌కీ ఆ ప్రియ‌మైన వ్య‌క్తి ఎవ‌రో వ‌రుణ్ తండ్రి, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. అవును, తండ్రీకొడుకులిద్ద‌రూ వెకేష‌న్ కోసం దుబామ్ వెళ్లారు. ఓ వారం రోజుల పాటు అక్క‌డే ఉండ‌బోతున్నార‌ట‌.

Image

ఇక నిన్న దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ టి20 క్రికెట్ మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను వ‌రుణ్‌-నాగ‌బాబులు స్టేడియం లో కూర్చుని లైవ్ లో చూసి ఎంజాయ్ చేశారు. అలాగే దుబాయ్ లో షాపింగ్, ఖరీదైన హోటల్స్ లో స్టే, టేస్టీ ఫుడ్స్‌.. ఇలా అన్నిటినీ నాగబాబు, వరుణ్‌లు ఆశ్వాదిస్తున్నారు.

Image

దాంతో ప్ర‌స్తుతం వీరి వెకేష‌న్‌కి సంబంధించిన పిక్స్ కొన్ని నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, వ‌రుణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న గ‌ని చిత్రంలో న‌టిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా.. డిసెంబ‌ర్ 3న విడుద‌ల కాబోతోంది.

కొడుకు వరుణ్ తో దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నాగబాబు... వైరల్ గా వెకేషన్ ఫోటోలు | nagababu varun enjoys dubai vacation wacthed india versus Pakistan t20 match

nagababu hashtag on Twitter