నాగ చైతన్య అక్కినేని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణదాస్ నారంగ్ మరియు రామ్ మోహన్ రావు నిర్మించారు.
భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో అదిరిపోయే కలెక్షన్స్ను రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని `ఏయ్ పిల్లా’ సాంగ్లో ఓ ముద్దు సీన్ ఉంటుంది. కానీ, ఆ సీన్లో చైతును నిజంగా నేను కిస్ చేయలేదని.. అది కేవలం కెమెరామెన్ ట్రిక్ అని సాయి పల్లవి ఓపెన్గానే చెప్పేసింది.
అయితే ఇప్పుడు ఈ సీన్ గురించి ఆ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సాయి పల్లవి ముద్దు పెట్టే సమయంలో చైతూ ముఖంలో భావోద్వేగాలు స్పష్టంగా వచ్చేంత వరకు సీన్ షూట్ చేశారట. దాంతో ఈ సీన్ కోసమే దాదాపు ఆరుగంటల సమయాన్ని తీసుకున్నాడ చైతు. ఇక చిత్రంలో కీలకమైన సన్నివేశం ఇదే కావడంతో సరైన ఎక్స్ప్రెషన్స్ వచ్చే వరకు శేఖర్ కమ్ముల ఈ సీన్ను తెరకెక్కిస్తూనే ఉన్నారట.