రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుంచీ పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు.
ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, రాశి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మంచు లక్ష్మి, శ్రీకాంత్, నరేష్, శివబాలాజీ, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, మహర్షి రాఘవ, సాయి వెంకట్, ఖయ్యుమ్, వేణు, ఈటీవీ ప్రభాకర్, సాయి కుమార్, ఆది సాయి కుమార్, సీనియర్ హీరో వేణు.. తదితరులు ఇప్పటి వరకు ఓటు వేశారు.
కాగా, మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్లను లెక్కిస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అధ్యక్షుడి ఫలితాలు బయటకు రానున్నాయి. ఇక ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా, వీరిలో 883 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. అయితే వీరిలో 500 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.