రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్`. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ప్రభాస్తో తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి సనన్.. మొదటి నుంచీ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తూ వస్తోంది.
ఒకానొక సమయంలో కృతి ..ప్రభాస్ను ఏకంగా పెళ్లి చేసుకుంటూ అంటూ ఓపెన్గా చెప్పేసింది. మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ప్రభాస్ను ఫుల్ స్టడీ చేసిన కృతి సనన్.. తాజాగా ఆయనపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. `ఆయనకు కొంచెం సిగ్గు ఎక్కువ. కొత్తవాళ్లతో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.
కానీ, సెట్స్ లో అందరూ తెలిసిన వాళ్లే ఉంటే అస్సలు సిగ్గు పడరు. ఆ సమయంలో అందరిలోనూ కలివిడిగా మాట్లాడుతూ.. జోకులతో చెలరేగిపోతుంటాడు. అలాగే ప్రభాస్ వద్ద ఎప్పుడూ పాజిటివ్ వైబ్సే ఉంటాయి. అందుకే ఆయనంటే నాకెంతో ఇష్టం` అంటూ కృతి సనన్ చెప్పుకొచ్చింది. దాంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.