మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ రోజు ఉదయం ప్రారంభం అవ్వగా.. సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టినప్పటికీ.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.
అయితే మా ఎన్నికల్లో గందరగోళం ఏమీ లేదని ప్రకాశ్రాజ్, విష్ణు ప్రకటించారు. తామంతా ఒక్కటేనని తెలిపారు. కానీ, లోపల పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. తాజాగా శివబాలాజీ, హేమల మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శివబాలాజీ చేయిని హేమ కొరికిందట. అంతేకాదు, ఈ విషయాన్ని వీకే నరేష్ స్వయంగా మీడియాకు తెలియజేస్తూ.. శివబాలాజీ చేతికి ఉన్న గాయాన్ని కూడా చూపించారు. మరి ఇంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. మొత్తం 850 ఓట్లకు గాను ఇప్పటి వరకు 240 ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది.