షారుక్, అనన్య పాండే నివాసంలో ఏసీబీ దాడులు ..!

గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్స్ మాఫియా పై వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే డ్రగ్స్ మాఫియా కేసులో కొంత మంది బాలీవుడ్ తారల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ముంబై లోని క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. తాజాగా మరో బాలీవుడ్ నటి పేరు తెర పైకి వచ్చింది.

యువ నటి అనన్య పాండే నివాసంలో గురువారం ఎన్ సి బీఐ అధికారులు సోదాలు నిర్బహించారు. ఉదయం సోదాలు చేపట్టిన ఎన్ సి బి అధికారులు విచారణ నిమిత్తం అనన్య పాండే ను మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఆమె ఫోన్ ను కూడా ఎన్ సి బీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ సందర్భంగా ఎన్ సి బి అధికారులు బుధవారం కీలక సమాచారాన్ని కోర్టుకు అందజేశారు. క్రూయిజ్ నౌక పై పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్యన్ డ్రగ్స్ కోసం ఓ కొత్త నటి తో వాట్సాప్ చాటింగ్ లో చేసినట్లు ఎన్ సి బి పేర్కొంది. ఆ వివరాలను కోర్టుకు సమర్పించింది. ఆ చాట్లో ఉన్నది అనన్య పాండే పేరే అని తెలుస్తుంది.

నటుడు షారూక్ నివాసం లో కూడా ఎన్ సి బి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.గురువారం ఉదయం షారూక్ తన కుమారుడు ఆర్యన్ ను కలిసేందుకు ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లగా అక్కడి నుంచి తిరిగి వెళ్లిన కొద్ది గంటలకే ఎన్ సి బి అధికారులు
షారుక్ ఖాన్ నివాసం మున్నత్ కు వెళ్లడం గమార్హం.