టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత ఈ మధ్య వార్తల్లో తెగ ట్రెండ్ అవుతుంది. భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకోబోతోందని టాక్ బయటకు రావడంతో.. సమంత ఏం చేసినా, ఎక్కడకు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టినా వైరల్గా మారిపోతున్నాయి.
ఇటీవల ఒంటరిగా గోవా వెకేషన్కు వెళ్లిన సమంత.. ఈ మధ్య తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, త్రిష, కళ్యాణి ప్రియదర్శిన్ లతో రచ్చ రచ్చ చేసింది.
తాజాగా చెన్నైకి వెళ్లిన సమంత.. ఆ ముగ్గురు హీరోయిన్లతో కలిసి వీకెండ్ పార్టీ చేసుకుంది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన పిక్స్ను కూడా సామ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా.. అవి వైరల్గా మారాయి. ఇక ఈ ఫొటోలను చూస్తుంటే.. కీర్తి సురేష్, త్రిష, కళ్యాణి ప్రియదర్శిన్, సమంత నలుగురూ మస్తు ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.