టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా, ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
అయితే ఈ చిత్రం మొదటి భాగాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, అందుకు ఒక వారం రోజుల ముందుగానే .. అంటే డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ తాజాగా నిర్ణయించుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇది ఒకరకంగా బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ అనే చెప్పాలి. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఎస్.తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ `దాక్కో దాక్కో మేక..’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.