మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తేజ్ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అలాగే కొందరు ప్రముఖులు హాస్పటల్కి వెళ్లి తేజ్ను స్వయంగా పరామర్శిస్తున్నారు. అయితే తేజ్ విషయంలో హీరో నిఖిల్ మండిపడ్డారు. అసలు ఏం జరిగిందంటే.. ఐసీయూలో ఉన్న సమయంలో సాయి తేజ్ని స్పృహలోకి తెచ్చేందుకు డాక్టర్స్ ప్రయత్నిస్తూ.. ‘కళ్లు తెరవండి.. ఇటు చూడండి అంటూ భుజం తడుతుండగా, అందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది.
అయితే ఈ వీడియోపై నిఖిల్ ఘాటుగా స్పందించాడు. `ఐసీయూలో ఉన్నప్పుడైన వ్యక్తి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. ఐసీయూలోకి కెమెరాస్ ఎందుకు అనుమతి ఇస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఐసీయూ వీడియో బయటకు రావడం దారుణం` అని పేర్కొంటూ ఆసహనం వ్యక్తం చేశారు. దాంతో నిఖిల్ ట్వీట్ కాస్త వైరల్గా మారింది.
https://twitter.com/actor_Nikhil/status/1437328035397574664?s=20