ఆ భయం పట్టుకున్న రానా.. అందుకే ఆలస్యం..?

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో నిర్మించిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రం నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించింది.ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ ప్రియమణి కూడా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావం ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం చేసుకుంది.ఇక కేవలం 5 రోజుల వర్క్ బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం.

ఇక అంతే కాకుండా ఈ సినిమా విడుదల తేదీని కూడా వాయిదా పడుతూనే వస్తోంది.ఇక పెద్ద సినిమాల సైతం ఓటిటిలలోనే విడుదల చేశారు.అయితే ఇప్పుడు ఎక్కువగా ఆలోచింప దగ్గ విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాలలో థియేటర్లో ఓపెన్ చేసిన.. సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు అసలు ఇష్టపడలేదు అన్నట్లుగా వినిపిస్తోంది.

విరాట పర్వం సినిమాని సురేష్ బాబు థియేటర్లో ని విడుదల చేయాలని చూస్తున్నాడట. ఇక అంతే కాకుండా మంచి రేటు వచ్చినప్పుడు అరణ్య సినిమాని థియేటర్ లో విడుదల చేసి తప్పు చేశానని అని తెలియజేశారు. ఇక విరాటపర్వం సినిమా ఈ విషయంలో అలాంటి తప్పు చేయవద్దని నిర్మాతలు భావిస్తున్నారట.అయితే మరి ఏం చేస్తారు మరో కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.