తన బర్తడే రోజు ఆ పని చేయాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి, మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదు బాలీవుడ్ లోకి అడుగు పెట్టని ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా మహేష్ బాబు గుర్తింపు పొందాడు. కానీ కృష్ణకు మాత్రం తన కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ లో ఒక్క సినిమాలోనైనా నటించాలని , కృష్ణ చివరి కోరిక. ఇక కనీసం తండ్రి కోరికను తీర్చడానికి అయినా మహేష్ బాబు బాలీవుడ్ లోకి అడుగు పెడతారో లేదో వేచి చూడాలి..

ఇకపోతే మహేష్ బాబు 1975 ఆగష్టు 9వ తేదీన జన్మించిన విషయం తెలిసిందే. అయితే మరో మూడు రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు ఉంది.. కాబట్టి, ఆయన ముందుగానే తమ అభిమానులకు ఒక పని చేసి పెట్టాలి అంటూ కోరుతున్నాడు. ఇంతకూ ఆ పని ఏమిటి ..? ఆయన అంతలా పిలుపునివ్వడానికి గల కారణం ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మహేష్ బాబు ఆగస్టు 9వ తేదీన.. తన పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులకు పిలుపు ఇస్తున్నాడు.. అదేమిటంటే, ప్రతి ఒక్కరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ” లో భాగమై.. తన పుట్టినరోజు నాడు.. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు… అంతేకాదు ఆయన ఒక మొక్క నాటుతున్నట్టు వున్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఆ ఫోటో కింద ప్రతి ఒక్కరూ సమానంగా ఒక విత్తనం లేదా ఒక మొక్కను నాటి పొల్యూషన్ ని అరికట్టడానికి ప్రయత్నం చేయండి..నా పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటి నా మీద ఉన్న ప్రేమ ను చూపించండి..” అంటూ చెప్పాడు మహేష్ బాబు..ఇక పర్యావరణాన్ని కాపాడడానికి మహేష్ బాబు ఎంతలా పాటుపడుతున్నారో చెప్పకనే అర్థమవుతోంది. “ప్లాంట్ ట్రీస్ అండ్ సేవ్ గ్లోబల్”..