మెగా బ్రదర్స్ కి అంజనాదేవి గోరుముద్దలు..!

ఇలాంటి దృశ్యాలు అరుదుగా చూసి ఉంటారు. మెగా అభిమానులకు మెగా ఫ్యామిలీ లో ఇలాంటి విషయాలు కంటికి కనువిందుగా కనిపిస్తూ ఉంటాయి..ముఖ్యంగా ఇలాంటి రేర్ మూమెంట్స్ ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ దృశ్యాన్ని చూసి అభిమానులు ఎంతో పులకించి పోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బ్రదర్ నాగబాబు కలిసి ముగ్గురు ఒకే చోట కూర్చుని ఒకే పళ్ళెంలో భోజనం చేశారట.

వారికి ఆసక్తికరంగా వడ్డిస్తూ , వారి తల్లి అంజనా దేవి కొణిదల కూడా భోజనం చేశారు. ఆ దృశ్యం మంగళవారం లంచ్ టైంలో కనిపించింది. ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడంటే హైదరాబాదులోని శివార్లలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ దృశ్యం కనిపించింది.

ఇంతకు ముగ్గురు బ్రదర్స్ అక్కడ ఎలా కలిశారని మీరు ఆలోచిస్తున్నారా..? అక్కడే యాదృచ్ఛికంగా ఓకే చోటే షూటింగ్లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం లూసిఫర్ రీమిక్స్ చేస్తున్నారట. ఈ సినిమాకి మోహన్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆ పక్కనే పవన్ కళ్యాణ్ మూవీ కూడా జరుగుతోంది. పవన్ ,రానా హీరోలుగా సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న భీమ్లానాయక్ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇక ఇదే చోట తన తమ్ముడు నాగబాబు షూటింగ్ కూడా జరుగుతోంది. అంతే కాకుండా నటి విజయనిర్మల మనవడు నవీన్ విజయకృష్ణ సినిమాలో నాగబాబు కీలకపాత్ర వహిస్తున్నాడు. శివ దర్శకత్వం వహించగా, సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకే చోట షూటింగ్ చేయటం యాదృచ్చికం అనుకుంటే, ముగ్గురూ కలిసి ఒకేచోట కూర్చుని భోజనం చేయటం మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. తన కొడుకులకు వడ్డించటానికి అల్యూమినియం ఫ్యాక్టరీ కి వచ్చిన అంజనాదేవి కొణిదెల ఈ దృశ్యం చూడటానికి కళ్ళు చాలడం లేదు. ఆ ముగ్గురితో కలిసి అంజనాదేవి భోజనం చేశారు.