`భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కియారా అద్వానీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత వినయ విధేయ రామలో మెరిసిన కియారా.. మరో తెలుగు సినిమా చేయలేదు.
కానీ, బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఆఫర్లు వెల్లువెత్తుతుండడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిన కియారా.. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.4 కోట్లు చప్పున ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్న కియారాకు నిర్మాతలు ఆమె క్రేజ్ దృష్ట్యా నాలుగు కోట్లకు ఏ మాత్రం తగ్గకుండా రెమ్యునరేషన్ను ముట్టచెప్పుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇక రామ్ చరణ్-శంకర్ సినిమాలోనూ కియారానే హీరోయిన్. అయితే ఈ సినిమాకు సైతం కియారా దాదాపు అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. కాగా, సౌత్లో లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రమే అంత భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటోంది. ఇప్పటివరకు ఎవరూ ఆమెను అధిగమించలేదు. కానీ, కియారా జోరు చూస్తూంటే.. రెమ్యూనరేషన్ విషయంలో నయన్ను అతి త్వరలోనే పక్కకు నెట్టేసేలా కనిపిస్తోంది.