ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోతో బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలో షోపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో.. అభిమానులు, ప్రేక్షకులకు ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా ఈ షో ప్రారంభ తేదీని మేకర్స్ రివిల్ చేశారు. అగష్టు 22వ తేదీ నుంచి ఈ షో స్టార్ట్ కానుందని ఓ చిన్న ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలోన ఎన్టీఆర్.. `వస్తున్న మీ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రతి సోమవారం నుంచి బుధవారం సాయంత్రం రాత్రి 8:30 గంటలకు మీ జెమిని టీవీలో` అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్గా మారింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. కరెక్ట్గా అదే తేదీన రావడానికి ఎన్టీఆర్ ఫిక్స్ అవ్వడంతో.. మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://youtu.be/MjwgKOqqj-M