నాగ్‌, చిరుల రికార్డుల‌ను చిత్తు చేసిన ఎన్టీఆర్..`EMK` టీఆర్పీ ఎంతంటే?

గ‌త కొద్ది నెల‌లుగా బుల్లితెర ప్రేక్ష‌కులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు(EMK)` నిన్న జెమినీ టీవీలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా వ‌చ్చి సంద‌డి చేశాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్టైలిష్ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఈ షో అభిమానుల‌నే కాకుండా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

Ahead of Evaru Meelo Koteeswarulu's curtain raiser; a look at best pictures  of Jr NTR and Ram Charan that set major friendship goals | The Times of  India

ఎన్టీఆర్ చాలా హుందాగా గేమ్‌ ను నడుపగలడు అనే విషయం మొదటి ఎపిసోడ్‌ తోనే క్లారిటీ వచ్చేసింది. పైగా ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై క‌నిపించ‌డంలో ఈ షో ఫ‌స్ట్ ఎపిసోడ్‌ను మెగా, నంద‌మూరి అభిమానులకు క‌నుల పండ‌గ‌గా వీక్షించారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ కింగ్‌ నాగార్జున‌, మెగాస్టార్ చిరంజీవిల పేరిట ఉన్న రికార్డుల‌ను చిత్తు చేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Jr NTR Big Boss Vs Chiranjeevi, Nagarjuna - Meelo Evaru Koteeswarudu - Best  Host?

ఇదే షో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో స్టార్ మా ఛానల్‌లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి మూడు సీజ‌న్ల‌కు నాగ్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. నాల్గొవ సీజ‌న్‌కు చిరు హోస్ట్‌గా ఉన్నారు. వీరిద్ద‌రూ హోస్టింగ్ చేసే స‌మ‌యంలో ఈ షోకు 12 వ‌ర‌కు టీఆర్పీ వ‌చ్చేది. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఐదో సీజ‌న్ తొలి ఎపిసోడ్‌కు క‌రెక్ట్ ఫిగ‌ర్ తెలియ‌క‌పోయినా 20 కిపైగా టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే ఎన్టీఆర్ ఏ రేంజ్‌లో అద‌ర‌గొట్టాడో స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు.