కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్కు భారీ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దాంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే ఓ కొత్త దర్శకుడు చెప్పిన సరికొత్త కథతో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సిరస్లో రానా దుగ్గుబాటి కూడా నటించనున్నాడని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ చేయనున్నారని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది.
కాగా, వెంకీ తాజా చిత్రం నారప్ప జూలై 20 అమెజాన్ ప్రైమ్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక వెంకీ నటించిన మరో చిత్రం దృశ్యం 2 రీమేక్ కూడా ఓటీటీలోనే విడుదల కానుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.